తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా గత ఐదు రోజుల నుంచి వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్న 47 కేసులు నమోదు కాగా ఈరోజు 40 కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1454కు చేరింది. రాష్ట్రంలో ఈరోజు 13 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా గత రెండు రోజుల నుంచి కరోనా భారీన పడి ఎవరూ మృతి చెందలేదు. ఈరోజు నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: