జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతమాత్రం మంచిది కాదని ఆన్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలలో పరీక్షలు రద్దు చేశారని దేశంలో ఎక్కడా పరీక్షలు నిర్వహించడం లేదని అన్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలతో పాటూ పోటీ పరీక్షలు కూడా రద్దయ్యాయని వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని... పేపర్లు కుదించినా పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల, విద్యార్థుల కోరికను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేయాలని అన్నారు. ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలను ఏపీ ప్రభుత్వం అనుసరించాలని ఆయన సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: