హైదరాబాద్​ నగర శివారు శంషాబాద్​ పరిధిలో వెళ్తున్న ఫార్చునర్​ కారును నలుగురు దుండగులు దొంగలించారు. అయితే కొద్ది దూరం వెళ్లాక.. ఆ కారు బోల్తా కొట్టింది. దీనితో కారును వదిలేసి పరారయ్యారు.    హైదరాబాద్‌ శంషాబాద్‌లోని కోత్వాల్‌ వద్ద ఓ కారును... దొంగలించేందుకు నలుగురు వ్యక్తులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టంది. కొత్తూరు నుంచి జీడిమెట్ల వైపు వస్తున్న ఫార్చ్యునర్‌ కారుని ఆపిన నిందితులు... డ్రైవర్‌ను చితకబాది దొంగలించారు. అయితే కిలో మీటర్‌ దూరం వెళ్లగానే... కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు.
 
 
కారు డ్రైవర్‌ వినోద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో నగదు ఉందని డ్రైవర్‌ తెలపగా.... అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.  లాక్ డౌన్ సడలింపు లు వచ్చిన తర్వాత  నేరాలు పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రం లాక్ డౌన్ పొడిగిస్తూ వస్తున్న సమయంలో క్రైమ్ రేటు తగ్గిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కానీ ఈ క్రమంలో లాక్ డౌన్ తరువాత దొంగలు పెట్రేగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: