ఉత్తరాఖండ్ సర్కార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల్లో కరోనా వైరస్ పరీక్షలు మరింత విస్తృతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11.25 కోట్ల నిధులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు,.
కరోనా విస్తరిస్తున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఈ నిధులు విడుదల చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. అత్యవసర సామాగ్రి వైద్య పరికరాల యంత్రాల కొనుగోలు చేసి పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.