తెలంగాణాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా వేగంగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మంత్రి కేటిఆర్ కు కరోనా సోకింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. తనకు కరోనా సోకిందని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు.

ఇటీవల సిఎం కేసీఆర్ కు కూడా కరోనా సోకిందని చెప్పిన సంగతి తెలిసిందే. తనకు చాలా తక్కువ లక్షణాలు ఉన్నాయని కేటిఆర్ ప్రకటించారు. ప్రస్తుతం కేటిఆర్ యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తనను గత కొన్ని రోజులుగా కలిసిన వాళ్ళు అందరూ టెస్ట్ లు చేయించుకోవాలని ఆయన కోరారు. టెస్ట్ చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉన్నాను అని వెల్లడించారు. సాగర్ ఎన్నికల తర్వాత తెలంగాణాలో కేసులు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: