ఏపీలో గత 24 గంటల్లో 86,878 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 20,345 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.  గత 24 గంటల్లో కరోనా వైరస్‌ బారినపడి చిత్తూరు జిల్లాలో 18, విశాఖ జిల్లాలో 12,  తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున.. ప్రకాశం జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 8, కృష్ణా జిల్లాలో ఏడుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. వైఎస్సార్‌ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. మొత్తం 108 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 8,899 మంది మృతి చెందారు

మరింత సమాచారం తెలుసుకోండి: