టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో  పారిశ్రామిక వేత్త గంటా నరహరి తెలుగుదేశంలో చేరారు. 2017-18 సంవత్సరానికి రాష్ట్రపతి నుంచి బెస్ట్ ఎంగెస్ట్ ఎంట్రర్ప్రెన్యువర్ అవార్డు అందుకున్న గంటా నరహరి తెలుగు దేశం బాట పట్టారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కోసం ఒక కార్యకర్త లాగా పనిచేస్తానన్న గంటా నరహరి.. చంద్రబాబు ఏ బాధ్యతను ఇచ్చిన స్వీకరిస్తానన్నారు.

చంద్రబాబు ను ముఖ్యమంత్రి గా చూడటమే మా లక్ష్యమని గంటా నరహరి అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని.. మళ్ళీ అభివృద్ధి జరగాలంటే టీడీపీ  ప్రభుత్వం రావాలని గంటా నరహరి అన్నారు. ఈ చేరిక కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డితో పాటు మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. తటస్థులు తెలుగు దేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: