చాలా కాలంగా బీజేపీకి జనసేన మిత్ర పక్షంగా కొనసాగుతోంది. అయితే.. ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలోకి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ విలీనం చేయబోతున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు. శ్రీపాద వల్లబడు మీద ప్రమాణం చేసి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోనని పవన్‌ కల్యాణ్‌ చెప్పాలని వెల్లంపల్లి శ్రీనివాస్ స‌వాలు విసిరారు.  

పవన్ కళ్యాణ్ కు ఓటమి కొత్త కాదు అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఓట్లే రావన్న వెల్లంపల్లి శ్రీనివాస్.. వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గెలవడం అసాధ్యమన్నారు. పవన్ ఓటమి భయంతోనే గతంలో ఓడిపోయిన భీమవరం, గాజువాక నియోజక వర్గాలను వదిలేశాడని వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమైంది కాబట్టే ఏదో ఒక ఆరోపణ చేస్తున్నాడని.. పదేళ్లు పార్టీ నాయకుడుగా ఉండి కూడా బీజేపీ చెప్తే ఎంపీ, ఎమ్మెల్యే గానీ పోటీ చేస్తాననడం ఏంటని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp