ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకులకు ఎన్నో రకాల సౌకర్యాలను అందిస్తుంది. వాటివల్ల ప్రజల ప్రయాణం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పండుగలు, వేసవి కాలంలో ప్రత్యేక రైళ్లను నడపడం వల్ల ప్రయాణికులకు ఖచ్చితంగా ఉపశమనం కలుగుతోంది.ఇంకా అలాగే టిక్కెట్ బుకింగ్ వంటి సౌకర్యాలను ఎప్పటికప్పుడు కల్పిస్తున్నారు. రైల్వేలోని చాలా సౌకర్యాల గురించి ప్రయాణికులకు అవగాహన లేదు.ఇప్పుడు అలాంటి సదుపాయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు కనుక రైల్వేలో ప్రయాణిస్తున్నట్లయితే, లేదా మీరు రైల్వే స్టేషన్‌లో ఉండవలసి వస్తే, మీకు అక్కడ స్టేషన్‌లోనే గది లభిస్తుంది.ఇంకా మీరు ఏ హోటల్‌కి లేదా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీకు అతి తక్కువ ధరకే ఈ గదులు అందుబాటులోకి రానున్నాయి.ఇక రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు బస చేసేందుకు హోటల్ తరహాలో గదులని రెడీ చేశారు. 


ఇది AC గది, బెడ్, గదికి అవసరమైన అన్ని వస్తువులు కూడా అందులో అందుబాటులో ఉంటాయి. అలాగే రాత్రిపూట గదిని బుక్ చేసుకోవడానికి మీరు రూ.100 నుంచి రూ. 700 దాకా చెల్లించాల్సి రావచ్చు.ఇక మీరు రైల్వే స్టేషన్‌లో హోటల్ లాంటి గదిని ఎలా బుక్ చేసుకోవాలో తెలియాలంటే ఇక్కడ పేర్కొన్న కొన్ని టిప్స్ ని పాటించండి.ముందుగా మీరు irctc ఖాతాను తెరవండి.ఇక ఇప్పుడే లాగిన్ చేసి,తరువాత మై బుకింగ్‌కి వెళ్లండి. ఆ తరువాత మీ టికెట్ బుకింగ్ కింద రిటైరింగ్ రూమ్ ఆప్షన్ కనిపిస్తుంది.ఇక ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు గదిని బుక్ చేసుకునే ఎంపికను ఎంచుకోవాలి.ఇందుకు మీరు PNR నంబర్‌ను నమోదు చేయవలసిన అవసరం లేదు.అయితే కొంత వ్యక్తిగత సమాచారం ఇంకా ప్రయాణ సమాచారాన్ని ఖచ్చితంగా పూరించాలి. ఇక ఇప్పుడు చెల్లింపు తర్వాత మీ గది బుక్ చేయబడుతుంది.రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే ప్రస్తుతం అనేక వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఢిల్లీ-బీహార్ మార్గం కాకుండా పలు ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైలును నడుపుతున్నారు. అందువల్ల ప్రయాణీకులు కన్ఫర్మ్ టిక్కెట్లను పొందవచ్చు. ఇంకా అలాగే 18 వేసవి ప్రత్యేక రైళ్ల వ్యవధిని కూడా పొడిగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: