రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం కరువైపోతుంది..  ఈ మధ్యకాలంలో మనుషులు క్రూరమృగాల కంటే దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక మనుషులు సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు  అయితే ఒక వైపు మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఇంకోవైపు మూగ జీవాలను  సైతం వదలడంలేదు మనుషులు. అటు అడవిలో జీవించే జంతువులైన కాస్తంత మానవత్వంతో ఉంటాయేమో గాని అటు సభ్యసమాజంలో నాగరికతతో జీవించే మనుషులు మాత్రం రోజురోజుకూ మృగాల కంటే దారుణం గా మారిపోతున్నారు.



 గతంలో మనుషులు మానవత్వాన్ని జాలి దయ అనే గుణాన్ని మరిచి ఏకంగా మూగజీవాల విషయంలో దారుణంగా ప్రవర్తించిన ఘటనలూ ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇక ఎన్నో ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసాయ్.  ఈ క్రమంలోనే మూగ జీవాలపై మానవత్వం చూపించాలి అనే దానిపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. కాగా ఇక్కడ మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది చూస్తే అందరికీ హృదయం చలించిపోతుంది. మూగజీవాల విషయంలో మనుషులు అంత దారుణంగా ఎలా వ్యవహరించగలిగారు అని ఆశ్చర్యం కలుగుతుంది.



 ఏకంగా మూగజీవాల విషయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించారు మనుషులు  60 కోతులకు విషం పెట్టి గోనెసంచిలో కుక్కి తీవ్రంగా కర్రలతో రాళ్లతో కొట్టి చంపారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక చౌద్దారహళ్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన భారీగా గోనెసంచిలో దర్శనమిచ్చాయి . అయితే అటువైపుగా వెళ్తున్న స్థానికులు గోని సంచిలో ఏంటా అని పేరు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఆ గోనె సంచులలో కోతులను కి దారుణంగా హింసించి కొట్టినట్లు తెలుస్తోంది. ఇక స్థానికులు చూసేసరికే 30కిపైగా కోతులు ప్రాణాలు వదిలాయ్. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలు అయ్యి కొన ప్రాణంతో ఉన్న కోతులను అన్నింటికీ నీరు ఆహారం అందించడం లాంటివి చేశారు స్థానికులు.  అయితే ఇది ఎవరు చేశారు అనే దాని పై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: