ఎందుకంటే ప్రేమించిన కారణంగా ఏదో ఒక రీతిలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ఏకంగా ప్రేమించిన వారు మోసం చేశారు అన్న మనస్థాపంతో ఇక జీవితం వృధా అని భావించి ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది ప్రేమను గెలిపించుకోలేకపోయామే అనే బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొన్ని ఘటనల్లో పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ఇక ఆ పెద్దలే చివరికి సొంత పిల్లలను చంపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ప్రేమ కారణంగా ఏదో రకంగా ప్రాణాలు పోతూనే ఉన్నాయి.
ఇక ఇటీవల హైదరాబాద్ నగరం లో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. రాయదుర్గం లో ఓ దారుణ హత్య జరిగింది టోలిచౌకికి చెందిన విశాల్ సింగ్ మణికొండ లో నివాసం ఉండే యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అయితే ఈ విషయం ఆ యువతి అన్నయ్య శ్యాంకు తెలిసింది. ఈ క్రమం లోనే విశాల్ కు ఫోన్ చేసి మణికొండ కి రమ్మని పిలిచాడు శ్యామ్. అక్కడ విశాల్ సింగ్తో కలిసి శ్యామ్ అతని స్నేహితులు మద్యం తాగారు. ఈ క్రమం లోనే వారి మధ్య యువతి విషయం రావడంతో ఇక ఇదే విషయంపై ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే శ్యామ్ అతని స్నేహితులు విశాల్ ను దారుణంగా కొట్టి చంపేశారు.