రాజకీయ పార్టీల్లో అసంతృప్తులను ఆదిలోనే తుంచేయకపోతే వారు పెరిగి పెద్దై పార్టీలకే మాయని మచ్చగా మిగులుతారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల్లో ఉండి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని అధిష్టానం కంట కనిపెడుతూనే ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బాగా అయ్యాయి.  ఖమ్మంలో వైసీపీ తరఫున 2014 లో  పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ఎంపీగా గెలిచారు. పొంగులేటికి కాకుండా పువ్వాడ అజయ్ కుమార్ ను 2018 లో హైలైట్ చేశారు. దీంతో పాటు పొంగులేటికి 2019 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చి పొంగులేటిని పక్కన పెట్టారు. అయినా పొంగులేటి సమయం తనది కాదనుకుని శాంతించారు.


ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి పొంగులేటి ప్రత్యేకంగా జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పొంగులేటి మొన్నీ మధ్య మాట్లాడుతూ..  ఏదైనా జాతీయ పార్టీలో చేరతానని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇలా ఒక్కో అసమ్మతి నేతల్ని పార్టీ నుంచి సీఎం కేసీఆర్ బహిష్కరిస్తున్నారు.


ఈ సమయంలో పొంగులేటికి ఖమ్మం జిల్లాలో మంచి పట్టుంది. ఆయన ప్రస్తుతం వైఎస్సార్ టీపీ పార్టీ షర్మిల వైపు చూస్తున్నట్లు సమాచారం.  ఆయన 2014 లో వైసీపీ తరఫునే గెలిచారు. 2019 లో టికెట్ కు టీఆర్ ఎస్ నిరాకరించింది. ఇప్పుడు బీఆర్ ఎస్ లో నుంచి తొలగించింది. గతంలో కమ్యూనిస్టుల అండతో గెలిచారని పొంగులేటికి పేరుంది. ఇప్పుడు కమ్యూనిస్టుల మద్దతు ఆయనకు ఉంటుందా ఉండదా. సీపీఎం పార్టీకి మిగిలిన ఒకే ఒక జిల్లా ఖమ్మం. ఇక్కడే కాస్త వారికి పట్టుంది. మరి పొంగులేటికి మద్దతు తెలుపుతారా? లేక సీపీఎం పార్టీ తన అభ్యర్థులనే రంగంలోకి దించుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: