వివేకాహత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల సుప్రీం కోర్టు ఆయనను సీబీఐ విచారిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టిన తీరు చూస్తే.. అవినాష్‌ అరెస్టు తప్పదని తెలుస్తోంది. అవినాష్ రెడ్డి విషయం లో తెలంగాణ హైకోర్టు అవలంబించిన  ప్రింటెడ్ క్వషనరీ ఇస్తే ఆయన ఆన్సర్ కూడా ప్రింటెడ్ గా ఇస్తారు అనేటువంటిది భారతదేశంలో ఏ కోర్టు కూడా ఇలాంటి పద్ధతి పెట్టలేదు. అయితే దీని పైన, నిందితుడికి లేదా అనుమానితుడికి ప్రశ్నోత్తరాలు పేపర్లో రాసి సమాధానాలు తీసుకోవడం అనే విషయం పైన సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.


ఏమిటి దర్యాప్తు విధానాన్ని మార్చేస్తారా, అలాంటప్పుడు ఇంకా సిపిఐ ఎందుకు? తీసేస్తే సరిపోతుంది కదా. కొషనరీస్- సమాధానాలు అంటే ఇన్వెస్టిగేషన్  అధికారులు అందరూ ఇలా చేసేసుకొని కోర్టులో అన్ని చేసేసుకుంటే సరిపోతుంది కదా అంటూ, సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఆ అంశం మీద ఇచ్చిన దాని మీదన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే పాయింట్ కి సంబంధించిన ఉత్తర్వులను కొట్టి పడేసింది.


ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది ఈ ఉత్తర్వుల విషయం  కొంతమంది అంటున్నారు. ఎందుకంటే విచారణ నిమిత్తం అవినాష్ రెడ్డిని మొదట్లో పిలిచినప్పుడే ఈ ఉత్తర్వులు అనేవి రావాలని అంటున్నారు. ఇప్పటికైతే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో వాంగ్మూలం, ఇలా అవినాష్ విచారణ అనేది మూడు రోజులు పూర్తయిపోయింది.  మొదటి రోజు ఎనిమిది గంటలు, రెండో రోజు 9 గంటలు మూడో రోజు ఆరు గంటలు ఇలా విచారణ చేపట్టారు. దాంట్లో ఆడియో వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఆడియో వీడియో రికార్డింగ్స్ ని సుప్రీంకోర్టు తప్పు పట్టడం లేదు కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విధానాన్ని మాత్రం అది తప్పు పడుతున్నట్లుగా తెలుస్తుంది.


అయితే అవినాష్ రెడ్డి తరఫున, అవినాష్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది చెప్పేదేంటంటే ఇలాంటిది ఇదివరకు జరగలేదు అని చెప్పారు. సునీత ఈ విషయంలో ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంది అనేది తర్వాతి వాదనలో తేలుతుందని సుప్రీంకోర్టు చెప్పింది‌.

మరింత సమాచారం తెలుసుకోండి: