ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం (Sanskrit) సబ్జెక్టును ప్రవేశపెట్టడంపై తెలంగాణ సర్కార్ ఒడిఒడిగా అడుగులు అనేవి వేస్తోంది.ఇక గత విద్యా సంవత్సరమే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగు సబ్జెక్టుకు ముప్పు తప్పదన్న ఆందోళన తెలుగు భాషాభిమానుల నుంచి వ్యక్తమవ్వడం జరిగింది. ఇక ఆ క్రమంలో చర్యలు నెమ్మదించినా మళ్లీ తాజాగా ఇంటర్‌ విద్యాశాఖ (Inter education department) రాష్ట్రంలో 150 కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని డిసైడ్ చేసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా 405 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా…ఇప్పటికే 13 చోట్ల ద్వితీయ భాషగా ఆ సంస్కృతం సబ్జెక్టు అనేది అమలవుతోంది. తాజాగా మరో 150 కళాశాలల్లో కూడా ఈ సబ్జెక్ట్ అవసరమని ఇంటర్‌ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సబ్మిట్ చేసింది.ఇక ఒక్కో కళాశాలలో ఒక పోస్టు చొప్పున 150 సంస్కృతం అధ్యాపకుల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ ఇటీవల ప్రతిపాదించడం జరిగింది.



ఇంటర్‌లో విద్యార్థులు ప్రథమ భాషగా ఆంగ్లం ఇంకా అలాగే ద్వితీయ భాషగా తెలుగు లేదా ఉర్దూ లేదా హిందీ లేదా అరబిక్‌ లేదా సంస్కృతం చదువుతున్నారు.మొత్తం కళాశాలల్లో కూడా కనీసం 350కిపైగా కళాశాలల్లో తెలుగునే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సంస్కృతాన్ని బలోపేతం చేయాలని భావించి ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెడుతోంది. ఇది వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచే అమలు కావొచ్చని కూడా భావిస్తున్నారు. దీని వల్ల తెలుగు భాష ప్రమాదంలో పడినట్లేనని అనేక తెలుగు భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఎక్కువ మార్కుల కోసం ప్రభుత్వమే మాతృభాషను కాదని ఇతర భాషను ప్రోత్సహిస్తే ఎలా అన్న ప్రశ్న వారి నుంచి ఎక్కువగా వస్తోంది.సంస్కృత భాష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది చాలా గొప్ప భాష. దీనికి గొప్ప చరిత్ర వుంది. మన దేవుళ్ళు కూడా ఈ భాషలోనే మాట్లాడుతారని మనం వింటూ ఉంటాం. .

మరింత సమాచారం తెలుసుకోండి: