గుడ్ న్యూస్.. రైల్వేలో భారీ ఉద్యోగాలు..?

దేశావ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటనను రిలీజ్ చేసింది.ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మార్చి 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఏప్రిల్‌ 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ ఇంకా ఈబీసీ అభ్యర్థులు రూ.250. జనరల్ కేటగిరీ అభ్యర్ధులు అయితే రూ.500 రిజిస్ట్రేషన్‌ రుజుము కింద చెల్లించాలి. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం ఇంకా అలాగే గోరఖ్‌పూర్.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.


రాత, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. జులై 1, 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకైతే 18 నుంచి 36 ఏళ్లు ఉండాలి. ఇక టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకైతే 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29,200 జీతం , టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు నెలకు రూ.19,900 వరకు జీతంగా చెల్లిస్తారు. ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీటికి సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్‌ వంటి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: