ఇక వర్షాకాలం వచ్చింది కాబట్టి , అందరూ ఎక్కువగా సీజనల్ వ్యాధుల బారిన పడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ వర్షాకాలంలో చాలామంది చికెన్ గున్యా, డెంగ్యూ ,మలేరియా, జ్వరము, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కాలంలో వచ్చే వ్యాధులన్నీ దోమకాటు వల్ల వస్తాయి అని అందరికీ తెలుసు. అందుకే ఈ దోమల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ దోమలను తరిమి కొట్టాలి అంటే, ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. బహిరంగ ప్రదేశాలలో ఉపరితలం మీద నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మన చుట్టూ వున్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నాయో..? లేదో..? కూడా తెలుసుకోవాలి.
ఇక సమూహంలో ఒకరిద్దరిని టార్గెట్ చేసినట్లు గానే, ఈ దోమలు కూడా కేవలం కొంత మందిని మాత్రమే టార్గెట్ చేస్తాయట. ఇక మిగతా వారిపై ఎటువంటి ప్రభావం కూడా ఇవి చూపించవట.. ఇందులో ఎంత నిజం ఉందనే విషయంపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం కూడా చేశారు. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే, నిజంగానే దోమలు కొంతమంది పై తమ ప్రభావాన్ని చూపిస్తాయి.. అని తెలిపారు. కార్బన్డయాక్సైడ్ , లాక్టిక్ యాసిడ్ లు వంటివి ఎవరైతే ఎక్కువగా తమ శరీరం నుంచి వదులుతారో, వారినే ఈ దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయట. అలాంటి వారిలో " ఓ "బ్లడ్ గ్రూపు ఉన్నవారు ముందు వరుసలో ఉంటారని, ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఏ, బి రక్త వర్గాల వారితో పోల్చుకుంటే, ఓ రక్త వర్గం కలవారిని ఈ దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయని ,ఈ అధ్యయనంలో తేలిందట. ఇక ఊబకాయం ఉన్నవారిని, గర్భిణీ స్త్రీలను కూడా ఈ దోమలు టార్గెట్ చేస్తాయట. మీరు కూడా ఓ బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటే, దోమల నుంచి పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి