

అలా కూల్చిన ప్రదేశం లో ఏకంగా 52 టన్నుల పెద్ద అయస్కాంతం వుండేదని, ఈ అయస్కాంతం గుడిలో ఉన్న విగ్రహాన్ని తేలేలా చేసేది అని చరిత్రకారులు స్పష్టం చేశారు. అయితే దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని తీసుకోవాలి అంటే కచ్చితంగా అయస్కాంతాన్ని కూల్చివేయాలి. అలా 17వ శతాబ్దంలో అయస్కాంతాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఈ అయస్కాంతాన్ని ఎవరు కూల్చివేశారు..? ఎందుకు కూల్చివేశారు.? అనే విషయాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.
అంతే కాదు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ గుడి కి నిర్మించిన 24 రథ చక్రాలలో అంతులేని విజ్ఞానం దాగి ఉంది. ఎందుకంటే ఈ రథచక్రాలు సన్ డైల్స్ లాగా పనిచేస్తాయి కాబట్టి. ఈ సన్ డైల్స్ ఇప్పటికీ ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి అంటే మన భారతదేశ నిర్మాణ నైపుణ్యం ఎంతటిదో చక్కగా తెలుస్తోంది. అందుకే ఈ దేవాలయాన్ని యునెస్కో అధికారులు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇలా ప్రపంచంలోనే లేని ఎన్నో రహస్య చారిత్రక దేవాలయాలు మన భారతదేశంలో వున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి