ఓ చాకలివాడు ఓ కుక్కను ఓ గాడిదను పెంచేవాడు. తమ బట్టలు ఉతకడానికి గాడిద వీపు మీదపెట్టి చెరువు గట్టుకు పోయేవాడు. రాత్రివేళల్లో కుక్క యజమాని ఇంట్లోకి ఎవ్వరూరాకుండా కాపలా కాసేది. ఇలా జరుగుతుండగ ఒకనాటి రాత్రి దొంగ చాకలివాడు ఇంట్లోకి వెళ్లి విలువైన వస్తువులన్నీ మూటగట్టాడు. ఇదంతా చూస్తున్న గాడిదకు మనసు మనసులో లేకుండా పోయింది. ఆ సమయంలో తన స్నేహితుడు కుక్క గుర్రపెట్టి నిద్రపోతుంది. అందువల్ల తనకూడా చేస్తూ ఊరుకుంటే యజమాని ఇల్లంతా దొంగ దోచుకుంటాడని గ్రహించి గాడిద గట్టిగా ఓండ్రపెట్టడం మొదలు పెట్టింది. ఈ అలికిడికి దొంగ కాస్తా, జారుగున్నాడు. అలా నిశిరాత్రివేళ గాడిద ఓండ్ర పెట్టడంతో ఆగ్రహించిన చాకలివాడు వెంటనే ఓ దుడ్డకర్రను తీసుకుని తన నిద్ర పాడు చేసినందుకు గాడిదను విపరీతంగా కొట్టాడు. ఆ దెబ్బలకు గాడిద, గట్టిగా అరుస్తూ చనిపోయింది. జోలిమాలిన పనికి పోరాదనడానికి ఈ కథే ఉధాహరణ ఎవరు చేయాల్సినపని వారే చేయాలన్న ఈ కథ సారాంశం.  

మరింత సమాచారం తెలుసుకోండి: