తెలుగు తెరపై ఇప్పుడు కొత్త హీరోలు, హీరోయిన్ల హవా నడుస్తుంది. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో వెండి తెరకు పరియం అయిన రాజ్ తరుణ్, అవికా గోర్ ఆ సినిమా సక్సెతో తర్వాత చిత్రంలో మంచి చాన్స్ కొట్టేశారు. ఈ ఇద్దరు ఇప్పుడు బిజీ హీరో, హీరోయిన్లుగా మారిపోయారు.  సుకుమార్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన కుమారి 21 ఎఫ్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో చిన్న నిర్మాతలకు కల్పతరువుగా  మారాడు రాజ్ తరుణ్. 


 ‘ఉయ్యాల జంపాలా’ తర్వాత రాజ్ తరుణ్ నటించిన ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి21ఎఫ్’ సినిమాలు రెండు కూడా మంచి విజయం సాధించాయి. దీంతో ఈ హీరోతో సినిమాలు తీస్తే మినిమం గ్యారెంటీగా పది కోట్లు రాబట్టోచ్చు అని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అంతే కాదు తమ సినిమాల్లో నటించాలని క్యూలు కూడా కడుతున్నారట. ఇక  రాజ్ తరుణ్-అవికాలు కలిసి ‘ఉయ్యాల జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాల్లో నటించి, హిట్ పెయిర్ గా మంచి మార్కులు కొట్టేసారు. ఇప్పుడు ఈ కాంబి నేషన్ లో హ్యాట్రిక్ సినిమా రాబోతుందా అంటే అవుననే అంటున్నారు.

‘సినిమా చూపిస్త మావ’ చిత్రం పోస్టర్


రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ నటుడు, నిర్మాత మంచు విష్ణు నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అవికా గోర్ నటించ బోతుతుందట. అయితే సినిమా ఇండస్ట్రీలో మంచి హిట్ సాధించిన హిట్ పెయిర్ తో మూడవ సారి సినిమా తీస్తే మరో విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారట చిత్ర యూనిట్. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరతో కలిసి మంచు విష్ణు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: