ఏపీ  లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి లో సెకండ్ ఇయర్ చదువుతున్న తెలంగాణా విద్యార్ధి ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ కి చెందిన ఇరవై సంవత్సరాల గుగులోతు మనో కృష్ణ రిమ్స్ లో రెండో సంవత్సరం చదువుతున్నాడు.


గత శనివారం ఇంటికొచ్చిన మనోకృష్ణ అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. గమనించిన తండ్రి ఆరా తీయగా ఏమీ లేదని, బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు.


 గురువారం నాడు సినిమాకి వెళ్లి వచ్చిన కృష్ణ ఇంటికి వచ్చి ఫాన్ కి ఉరి వేసుకుని చనిపోయాడు.


ఆత్మహత్య కి ముందర రాసిన సూసైడ్ నోట్ ఘటన స్థలం లో దొరికింది. తల్లి తండ్రులు కోరుకున్నట్టు తాను చదవలేకపోతున్నాను అనీ తనని క్షమించాలి అనీ అందులో రాసి ఉండడం తో అందరూ షాక్ అయ్యారు. డాక్టర్ చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు ఇలా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: