చిరంజీవి కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా జై చిరంజీవ. ఈ సినిమా కథ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమాను ఏదో స్థాయిలో చూపించాలి అని భావించి అనవసరంగా తప్పటి అడుగులు వేయకుండా ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. కథ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ల్లో చాలా వరకు ఈ సినిమాలో తీసుకోలేదు అనే ఆరోపణలు వచ్చాయి. ఇక చిరంజీవిని అమెరికాకు వెళ్లి చూపించాలి అక్కడ కథ విషయంలో పట్టు తీసుకుని రావాలి అని చూసినా సరే కామెడి మాత్రమే మిగిలింది. 

 

ఇక ఈ సినిమా కథ విషయం పక్కన పెడితే బుల్లి తెర మీద మాత్రం ఈ సినిమా చాలా బాగా హిట్ అయింది అని చెప్పవచ్చు. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాని కథలో అనవసరంగా పెద్ద పెద్ద తప్పులు చేయడం తో సినిమా అంతగా జనాల్లోకి హాల్ లో చూసే విధంగా వెళ్ళలేదు అనే చెప్పాలి. సినిమాలో భూమిక నటన చిరంజీవి నటన అన్నీ కూడా బాగానే ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. చాలా అందంగా నటించింది ఈ సినిమాలో భూమిక. సమీరా రెడ్డి ఫెయిల్ అయింది గాని ఆమె మాత్రం కథకు బలం అయింది. 

 

ఇక అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా సినిమాను ఇష్టపడ్డారు అని చెప్తారు. వారికే ఈ సినిమా బాగా నచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమాను వారే ఎక్కువగా టీవీ లో వస్తే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. ఈ సినిమా తర్వాత  చిరంజీవి పెద్దగా సినిమాలు చేయలేదు. ఒక సినిమా చేసి ఆపేశారు ఆయన. ఇక ఇప్పుడు ఆయన ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: