దేశంలో గోవా ఉన్న పేరు ప్రఖ్యాతులు గురించి తెలిసిందే. బీచ్ అందాలు, సముద్రపు హోరు, టూరిస్టులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఫారిన్ టూరిస్టులు ఎక్కువగా వచ్చే దేశంలోని ఏకైక ప్రదేశం బీచ్. విదేశీయులు బీచ్ ఒడ్డున విశ్రాంతి తీసుకోవాలంటే గోవా తప్ప ఇండియాలో వేరే ప్రదేశం లేదు. ఇటివల ఇద్దరు నటీనటులపై సౌత్ గోవాలో పోలిస్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు పూనమ్ పాండే కాగా.. మరొకరు మిలింద్ సోమన్.


నవంబర్ 4న మిలింద్ సోమన్ తన 55వ పుట్టినరోజును గోవాలో జరుపుకున్నాడు. ఫిట్ నెస్ కు అధికప్రాధాన్యం ఇచ్చే మిలింద్ బర్త్ డే సందర్భంగా గోవా బీచ్ లో నగ్నంగా పరిగెత్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు కూడా. స్వతహాగా నటుడైన మిలింద్ మోడలింగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇటువంటి ఫీట్స్ మిలింద్ కు కొత్త కాదు. 1995లో మరో మోడల్ మధు సప్రేతో న్యూడ్ గా ఓ షూ కంపెనీ కోసం యాడ్ చేశాడు. ఇందులో వీరిద్దరూ న్యూడ్ గా కౌగిలించుకుని వారిపై కొండచిలువ ఉండగా కేవలం షూస్ మాత్రమే ధరించారు. దేశవ్యాప్తంగా అప్పట్లో ఆ ఫొటో సెన్సేషన్ సృష్టించింది.


దీంతో ఇప్పుడు మిలింద్ చేసిన పనికి నెట్టింట్లో మిశ్రమ స్పందన వస్తుంది. మిలింద్ చేసింది తప్పంటే.. ఇది తనకేం కొత్త కాదు అని అంటున్నారు. మిలింద్ చేసిన పనిపై గో సురక్ష మంచ్ అనే సంస్థ ఫిర్యాదు చేయడంతో ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ సెక్షన్ 294 కింద కొల్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇటివలే ఈ తరహాలో నటి పూనమ్ పాండేను కూడా గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: