టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అశోక్ మూవీలో నటించిన సమీరా రెడ్డి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈ అమ్మడు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫిట్ నెస్ పాఠాలు చెబుతోంది. తాను ప్రెగ్నెన్సీ టైంలో అనేక బాధలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా డెలివరీ అయ్యాక బరువు కూడా విపరీతంగా పెరిగిపోయి, రూపాన్ని కోల్పోవడంతో కెరియర్ ఎలా అని తెగ ఫీలయిపోయిందట. బరువు పెరగడంతో తాను పరిశ్రమలో వేధింపులు కూడా ఎదుర్కున్నానని ఓపెన్ అయింది. సోషల్ మీడియాలో ఇటీవల సమీరా రెడ్డి మేకప్ లేకుండా దిగిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొంత మంది నెటిజన్లు ఈ ఫొటోలపై అసభ్యకర కామెంట్లు కూడా పెడుతున్నారు. వారందరికీ ఈ అమ్మడు స్ర్టాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. అధిక బరువును తగ్గించుకునే ఉపాయాల గురించి ఈ బ్యూటీ చెప్పిన విశేషాలను ఓ సారి చూద్దాం.


అధిక బరువును తగ్గించుకునేందుకు అడపాదడపా ఉపవాసాలు చేయాలని తెలిపారు. అంతే కాకుండా చక్కెర పదార్థాలను చాలా లిమిట్ గా తినాలని, యోగా ను తప్పనిసరిగా నిత్య జీవితంలో అలవాటు చేసుకోవాలని సూచించారు. తాను అధిక బరువును తగ్గించుకోవడానికి బ్యాడ్మింటన్ కూడా ఆడినట్లు ఈ ముద్దు గుమ్మ తెలిపింది. బరువు తగ్గాలని కృత నిశ్చయంతో తీవ్రంగా శ్రమించి ఫలితం సాధించినట్లు పేర్కొంది. ఇప్పటికి కూడా వారానికి నాలుగు సార్లు తప్పకుండా యోగా చేస్తానని వెల్లడించింది.  ఊబకాయం విషయంలో బాల్యంలోనే సమీరా రెడ్డి ఎన్నో అవమానాల్ని ఎదుర్కుని .. తట్టుకొని నిలబడింది. సమీరా రెడ్డికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను తన కుటుంబ సభ్యలతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ తన ఫ్యాన్స్ తో పంచుకుంటారు. ఈ భామ రీసెంట్ గా తన భర్త, అత్త , పిల్లలతో కలిసి గోవా టూర్ కు వెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: