టాలీవుడ్ క్రేజియెస్ట్ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేశ్‌కు ఉన్న పేరు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గణేశ్ ప్రొడక్షన్ హౌజ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సక్సెస్ తర్వాత గణేశ్ ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత స్టార్ హీరోస్‌తో సినిమాలు చేశారు. అయితే, మధ్యలో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ అక్కడి నుంచి వెనక్కు వచ్చేసిన బండ్ల.. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ద్వారా కమెడియన్‌గా వెండితెరపై మళ్లీ మెరిశారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఓ చిత్రం వస్తోంది. ‘ఓర్త సెరువు సైజు 7’ అనే తమిళ సినిమా తెలుగు రీమేక్‌లో బండ్ల గణేశ్ హీరోగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ తాజాగా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. బండ్ల గణేశ్ ఈ మూవీలో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత బండ్ల గణేశ్ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు కొందరు. అయితే, బండ్ల హీరోగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ రీమేక్ చేస్తుండటం విశేషం. కాగా ఒరిజినల్ తమిళ్ ఫిల్మ్‌కు నేషనల్ అవార్డు వచ్చింది.

 దాంతో బండ్ల గణేశ్ హీరోగా వస్తున్న సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.వెంకట్ చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతుందని బండ్ల పేర్కొంటున్నారు.  ఇకపోతే ఈ సినిమా విడుదల ఎప్పుడువుతుందని సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేశ్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బండ్ల ప్రొడక్షన్ హౌజ్‌లో గతంలో పవన్ ‘తీన్‌మార్, గబ్బర్‌సింగ్’చిత్రాలు చేయగా, త్వరలో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. బండ్ల ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోస్ రవితేజ, తారక్, బన్నీ, రామ్ చరణ్‌తో సినిమాలు తీశారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో, టెంపర్’ ఫిల్మ్స్ రెండూ బండ్ల గణేశ్ నిర్మించినవే కాగా, రెండూ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: