టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలకు గురి అవుతూ.. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్న భామలలో పంజాబీ ముద్దుగుమ్మ పూనం కౌర్ కూడా ఒకరు. ఇకపోతే ఇన్నిరోజులు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మళ్లీ నాతిచరామి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఏకంగా 20 ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ వేదికగా ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజున ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ కూడా జరిగింది.

అయితే ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడం గమనార్హం. ఇకపోతే నాతిచరామి సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేయగా అందులోని ఫోటోలను వాడుకొని కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ లో ఉపయోగించిన విధానం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నాతిచరామి టీం యూట్యూబర్లకు వార్నింగ్ ఇచ్చింది.. వారు మీడియా ముందు మాట్లాడుతూ.. యూట్యూబ్ మీడియా మిత్రులందరికీ నమస్కారము.. తాజాగా జరిగిన నాతిచరామి సినిమా ప్రెస్ మీట్ లో.. వీడియోల పైన ఎవరైతే అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ వాడారో.. ఇక అలాంటి వారందరి థంబ్ నెయిల్స్ ను మేము స్క్రీన్ షాట్ తీసి పెట్టాము.

ఇక ఎవరైతే మాట్లాడని విషయాలను వక్రీకరించి పెట్టారో వారందరూ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు నాతిచరామి టీం.. ఇకపోతే యూట్యూబ్ లో నేను పెళ్లి చేసుకొని యూ ఎస్ వెళ్ళి పోతా అనుకున్నాను.. ఆడదానిని అలా నాశనం చేస్తే వాడు నాశనమైపోతారు అంటూ ఎవరో థంబ్ నెయిల్స్ ఉపయోగించారు. కాబట్టి వారందరికీ త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని అంటూ నాతిచరామి టీమ్ స్పష్టం చేశారు. ఇకపోతే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: