ప్రపంచానికే ఇది శుభవార్త. ఇజ్రాయిల్- హమాస్ యుద్ధం ఆగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికపై హమాస్ సానుకూల స్పందన ఇచ్చింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న సమయంలో, ట్రంప్ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు అంగీకరించకపోతే "ఎన్నడూ చూడని నరకం" చూపిస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులు పనిచేసాయి, హమాస్ తమ చెరలో ఉన్న అందరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని ప్రకటించింది.

ట్రంప్ 20 అంశాల ప్లాన్‌లో బందీల మార్పిడి, తక్షణ సీజ్‌ఫైర్, గాజా పునర్నిర్మాణానికి అంతర్జాతీయ పరిపాలనను కలిగి ఉంది. హమాస్, పాలస్తీన్ ఖైదీల మార్పిడికి సిద్ధమని చెప్పినప్పటికీ, ప్లాన్‌లోని కొన్ని విషయాలపై మరిన్ని చర్చలు కావాలని సూచించింది. ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ప్రకారం, హమాస్ శాంతికి సిద్ధమైనట్లు కనిపిస్తోందని, ఇజ్రాయెల్ తక్షణం గాజా దాడులు ఆపాలని పిలుపునిచ్చారు. బందీలను సురక్షితంగా విడుదల చేయడానికి ఇప్పుడు పరిస్థితి అనుకూలమని ఆయన పేర్కొన్నారు.

హమాస్ ప్రకటనలో, 48 మంది బందీలలో 20 మందు బతికి ఉన్నవారిని, మిగిలినవారి శవాలను విడుదల చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం, ఈ అంగీకారంతో ప్లాన్ మొదటి దశను అమలు చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ఈ చర్చలు కతార్, ఈజిప్ట్ మధ్యవర్తుల ద్వారా వెంటనే ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. హమాస్, గాజా పరిపాలనను స్వతంత్ర పాలస్తీనా సాంకేతిక నిపుణుల సంస్థకు అప్పగించడానికి అంగీకరించింది.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: