టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల స్నేహం గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది ఇంకా అజ్ఞాతవాసి సినిమాలు వచ్చాయి. ఇక అత్తారింటికి దారేది సినిమా నుంచి వీరిద్దరి స్నేహబంధం విడిపోని విధంగా స్ట్రాంగ్ అయ్యింది. ఇక అప్పటినుంచి వారిద్దరిని విడదీసి చూడడం అనేది అసలు జరగని పని. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినకపోయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట మాత్రం వింటాడు అన్నది జగమెరిగిన సత్యం. ఇక గురువారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. 


ఇక ఈ సందర్భంగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తనకు త్రివిక్రమ్ ల మధ్య చాలా విషయాల్లో కూడా అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయని.. అయితే ఒక విషయంలో మాత్రమే ఆయనకు తనకు తేడా వస్తుందని చెప్పారు. అదేంటంటే ఒక్క పుస్తకాల విషయంలోనే మా ఇద్దరి మధ్య తేడాలు వస్తాయి. ఇద్దరం కూడా పుస్తకాల పురుగులమే.ఇక ఏదైనా పుస్తకం చదవడం మొదలు పెడితే.. అది పూర్తి అయ్యేవరకూ అసలు వదిలి పెట్టం. ఈమధ్య జరిగిన ఒక సంఘటన పంచుకున్నారు. నా దగ్గర ఉన్న పుస్తకాల్లో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నచ్చి ఇవ్వమని అడిగితే నేను అస్సలు ఇవ్వలేదు. కావాలంటే ఒక సినిమా ఫ్రీగా అయినా నీతో చేస్తాను కానీ ఆ పుస్తకం మాత్రం ఇవ్వను" అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.ఇక రీసెంట్ గా పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకి త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: