టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ ప్రాజక్ట్ సర్కారు వారి పాట. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సముద్రఖని, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా థమన్ సంగీతాన్ని, మది ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్, రెండు పాటలు విడుదలై అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై భారీ అంచనాలు పెంచాయి.

మహేష్ బాబు ఈ సినిమాలో ఒక వడ్డీ వ్యాపారస్థుడిగా కనిపించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరోవైపు ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మంచి మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా నుండి మూడవ సాంగ్ ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గా సమాచారం ప్రకారం ఈ సాంగ్ ని ఏప్రిల్ 2న ఉగాది పండుగ నాడు రిలీజ్ చేస్తారని, మురారి అనే పల్లవితో సాగే ఈ డ్యూయెట్ సాంగ్ ని గీత మాధురి, అర్మాన్ మాలిక్ ఆలపించినట్లు టాక్. మరోవైపు ఈ సినిమాపై రోజురోజుకి అందరిలో అంచనాలు పెరుగుతూ ఉండడంతో తప్పకుండా రిలీజ్ తరువాత సర్కారు వారి పాట అందరి అంచనాలు అందుకుని సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్, ఈ మూవీతో ఎంత మేర విజయం అందుకుంటారో తెలియాలి అంటే మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: