పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి వఖిల్ సబ్ మూవీ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. వఖిల్ సబ్ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

 ఇలా రీ ఎంట్రీ తర్వాత రెండు వరుస విజయాలను అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొఘల్ కాలం నాటి ఫిక్షనల్ కథతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో నోరా ఫతేహి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు 150 నుండి 200 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమాతో పాటు మొదలు అయిన హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత ఆగిపోయింది. తిరిగి కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ప్రారంభం అయ్యింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే వారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం మొదలుకానున్న తాజా షెడ్యూల్ లో చిత్ర బృందం పవన్ కళ్యాణ్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకమైన సెట్స్ ను కూడా వేసినట్లు సమాచారం.  ఈ షెడ్యూల్ తో హరిహర వీరమల్లు మూవీ కీలక భాగం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: