మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఇందిరాదేవి రీసెంట్ గానే మరణించారు. అనారోగ్య కారణంగా కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు .

ఈ ఊహించని పరిణామంతో మహేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చడం ఎవరి తరం కాలేదు భార్య పార్థివ దేహం వద్ద కుమిలి కుమిలి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు మహేష్ బాబు అమ్మ మరణంతో డీలా పడిపోయాడు.

చిన్నప్పటి నుంచి తనని అల్లారి ముద్దుగా పెంచిన అమ్మ ఇక్కడ లేరు అన్న వార్తను విని మహేష్ బాబు తల్లడిల్లిపోయాడు. తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకుంటూనే అమ్మకు జరగాల్సిన ఆఖరి కార్యక్రమాలు అన్నీ కొడుకుగా తన పూర్తి బాధ్యతలను నెరవేర్చాడు . అయితే మహేష్ బాబు అమ్మ మరణం తరువాత సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదట. అంతేకాదు ముఖం చిక్కిపోయి ఫుల్ నీరసపడిపోయి.. లాగేసి చూడటానికి పేషంట్ల తయారయ్యాడట. అంతేకాకుండా ఎవరితోను మాట్లాడడం లేదట . ఒంటరిగా అమ్మ గదిలో కూర్చుని బాధపడుతున్నారట .

ఇదే విషయం కారణంగా కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ బాధపడుతున్నారు . అయితే రీసెంట్గా మహేష్ బాబు అమ్మ పోయిన బాధ నుండి బయటకు రావడానికి సినిమా షూటింగ్లను మొదలుపెట్టనున్నాడట. మనకు తెలిసిందే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో మహేష్ బాబు తన 28వ సినిమాను గ్రాండ్ గా ప్రారంభించారు . మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రెండు షెడ్యూల్ ప్రారంభం కానుంది . అంతేకాదు అన్ని సవ్యంగా అనుకుంటే ఈపాటికే గ్రాండ్గా ధూమ్ ధామ్ గా సినిమాకు సంబంధించిన టైటిల్ ని రివీల్ చేయాలనుకున్నాడు మహేష్ బాబు. అయితే అమ్మ మరణం కారణంగా బాధపడుతున్న మహేష్ బాబు ఇప్పుడు అలాంటి ఈవెంట్స్ ఏవి ప్లాన్ చేయద్దని అనుకున్నారట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అభిమానుల కోసం మహేష్ బాబు దివాళి గిఫ్ట్ గా ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాకు సంబంధించిన టైటిల్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది .ఫాన్స్ కి ఎలాగైనా ట్రీట్ ఇవ్వాలని మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు . నువ్వు అంత బాధలో ఉండి కూడా అభిమానుల ఆనందం కోసం సినిమాలో నటించడానికి ఒకే చెప్పారు చూసావా నువ్వే రియల్ హీరో అంటే అంటూ పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: