తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతిముత్యం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే అక్టోబర్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించగా ,  వర్షా బోల్లమ్మ ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. 

మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయింది. ఇది ఇలా ఉంటే నిన్న ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ వారు స్వాతిముత్యం సినిమాని అక్టోబర్ 28 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా "ఓ టి టి" సంస్థ స్వాతిముత్యం సినిమాను అక్టోబర్ 28 వ తేదీన కాకుండా అక్టోబర్ 24 వ తేదీనే ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ఆహా "ఓ టి టి" సంస్థ ముందు చెప్పిన తేదీ కంటే ముందుగానే స్వాతిముత్యం మూవీ ని ఆహ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: