సోషల్ మీడియా వచ్చాక..ఏది ఎందుకు జరుగుతోందో ఎవరికీ అర్దం కావటం లేదు. అనుకోకుండా ఒక్కోటి వైరల్ ,ట్రెండ్ అయ్యిపోతున్నాయి. ఒక్కో టాపిక్ పై ఫ్యాన్స్ విరుచుకు పడిపోతున్నారు.ఇప్పుడు అలాంటిదే మైత్రీ మూవీస్ బ్యానర్ అప్డేట్స్ గురించి జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే...

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ కాంబోలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.షూటింగ్ మొదలై ఇంతకాలం అయినా ఇప్పటిదాకా ఈ సినిమా టైటిల్ ను రివీల్  చేయలేదు మేకర్స్. టైటిల్ ను మొదటి నుండి సస్పెన్స్ గానే ఉంచారు. అయితే ఇప్పుడు దీపావళి కానుకగాటైటిల్ ను వీరసింహా రెడ్డిగా అఫీషియల్ గా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ ఈవెంట్ కు చారిత్రక కట్టడమైన కర్నూలు కొండారెడ్డి బురుజును ఎంపిక చేయడంతో, బాలయ్య ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఫస్ట్ టైమ్ సీమలో ఉన్న ఐకానిక్ ప్లేస్ కొండా రెడ్డి బురుజు వేదికగా అక్టోబర్ 21న సాయంత్రం 8:15 నిముషాలకు,107 టైటిల్ ను లాంచ్ చేసారు. ఇంతవరకూ బాగానే ఉంది.

అయితే టైటిల్ ప్రకటన, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సమస్యగా మారింది. అందుకు కారణం ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప 2 నిర్మాతలు మైత్రీ వారే కావటం. సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో, సెకండ్ పార్ట్ ప్రారంభమైంది. ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి, చాలా కాలమే అయినా, పుష్ప2 గురించి మాత్రం ఇప్పటి వరకు, మైత్రి వారి నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరోవైపు తాజాగా బాలయ్య మూవీ అప్ డేట్ రావడంతో, సోషల్ మీడియాలో మైత్రీ మూవీ మేకర్స్ ని, బన్నీ ఫ్యాన్స్ ఎటాక్ చేస్తున్నారు. ఏకిపారేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ మూవీలో బాలయ్య పవర్ఫుల్ రోల్ చేస్తుండగా ఆయన కెరీర్ 107వ మూవీగా ఇది తెరకెక్కుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ పై బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య సరసన,శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్, తమిళ్ క్రేజీ
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల మంచి ఊపుమీద ఉన్న తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: