సర్కారు వారి పాట సినిమా తర్వాత సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఖలేజా తర్వాత దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తల్లి ఇందిరాదేవి మరణం తర్వాత సినిమా షూటింగులకు మహేష్‌బాబు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని ఇటీవల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. తాజా గా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఈ మూవీ రెండో షెడ్యూల్ నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుందని నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. సెకండ్ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్స్ షూటింగ్ ‌ను అతిత్వరలో స్టార్ట్ చేస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ వస్తాయని నాగవంశీ  చేశాడు.
 ఎన్టీఆర్-కొరటాల శివ మూవీ పై క్రేజీ అప్‌డేట్.. అభిమానులకు పండగే..!!

కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగానే హీరో మహేష్‌ బాబు ఫ్యామిలీ తో వెకేషన్ ‌కు వెళ్లి తాజాగా ఇండియా కు తిరిగొ చ్చాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో మహే ష్‌బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మహర్షి మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో మూవీ ఇది. ఈ చిత్రాని కి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. కాగా మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఇప్పటికీ ఈ సినిమాలను టీవీలలో టెలికాస్ట్ చేస్తే మంచి టీఆర్పీ రేటింగులు నమోదవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: