
ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉండడం వల్ల ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయడం కూడా అప్రయోజనమని నేతలు భావిస్తున్నారు. దీంతో, కడప లోకల్ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు – మాధవి వ్యతిరేకంగా దేవుని గడప వద్ద వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంతేకాదు, కడప నియోజకవర్గ నేతలు ర్యాలీ రూపంలో కమలాపురం వెళ్లి పుత్తా నరసింహారెడ్డిని కలుసుకొని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. మాధవి రెడ్డి, ఇతర పార్టీ నేతలకు, వేరే పార్టీ నుంచి చేరిన కార్యకర్తలకు వచ్చే కార్పొరేషన్ టిక్కెట్లు హామీ ఇచ్చిందని పేర్కొంటున్నారు. ఈ విధంగా తాము పార్టీ కోసం పనిచేసిన నేతలను పక్కన పెట్టి, కొత్త నాయకులకు అవకాశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రగడలకు కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితి చూస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు మాధవి రెడ్డిని కంట్రోల్ చేయకపోతే, ఈసారి ఎన్నికల్లో టీడీపీ కోల్పోయే మొదటి సీటు కడప అవుతుందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. కడపలో మాధవి ప్రభావాన్ని తగ్గించడం, లేదా వర్గాల్లో ఏకమై ఎన్నికలకు సిద్ధమవ్వడం అనే ఆలోచనలు చేస్తున్నారు. మొత్తానికి, కడపలో టీడీపీ అంతర్గత విభేదాలు స్పష్టంగా బయటకు వచ్చాయి. మాధవి రెడ్డి వ్యవహార పద్ధతులు, నాయకత్వంపై సవాళ్లు, కార్యకర్తల నమ్మకంపై ప్రతికూల ప్రభావం.. ఇవన్నీ ఈసారి కడపలో గెలుపునకు పెద్ద ప్రమాదం అని అనిపిస్తోంది. చంద్రబాబు మద్దతు, పార్టీ స్థిరత్వం లేకపోతే కడప సీటు కోల్పోవడం సాద్యమే. 2029 ఎన్నికల్లో ఈ విభేదాలు ఏ విధంగా పరిష్కరించబడతాయో చూడాల్సి ఉంది.