లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గతేడాది వివాహం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కోలీవుడ్ దర్శక నిర్మాత అయిన విగ్నేష్ శివన్ ను పెళ్లాడింది నయనతార.దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న వీరిద్దరూ చివరిగా ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి పద్ధతి ద్వారా పండంటి మగ కవలలకు జన్మనిచ్చింది నయనతార. ఈ క్రమంలోనే సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు తల్లి అయినందుకు అప్పట్లో పెద్ద వివాదాలనే ఎదుర్కొంది నయనతార. చాలా గొడవల తర్వాత లీగల్ గాని అన్ని వివాదాలకి ముగింపు పలికారు నయనతార దంపతులు .

ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతారకు తన భర్త విఘ్నేష్ శివన్ ఒక పెద్ద షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పిల్లల కోసం కొన్నాళ్లు సినిమా మానేయాలి అంటూ నయనతారకు చెప్పాడంట ఆమె భర్త. ఎవరి షూటింగ్స్ తో వారు బిజీగా ఉన్న కారణంగా టైం స్పెండ్ చేయడానికి ఏమాత్రం వారికి సమయం దొరకడం లేదట. ఈ క్రమంలోని ఇద్దరిలో కనీసం ఒకరైన పిల్లలతో కలిసి ఉండాలని భావించాడట నయన్ భర్త. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లు నటనకు బ్రేక్ ఇవ్వమని నయనతారకు చెప్పాడట. ఇక భర్త చెప్పిన మాట కాదనలేక తన భర్త చెప్పిన దాంట్లో న్యాయం ఉంది అని తెలుసుకున్న నయనతార

 కొన్నాళ్ళు సినిమాలకి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన దగ్గరకు వచ్చే కొత్త ప్రాజెక్టులను రిజెక్ట్ చేస్తోందట .ఇకపోతే ప్రస్తుతం నయనతార బాలీవుడ్ లో జవాన్ అనే ఒక సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తన సమయాన్ని మొత్తం తన పిల్లలకే కేటాయించాలని నయనతార దంపతులు గట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. పిల్లల కోసం నయనతార షూటింగ్లను పూర్తిగా మానేస్తే సినిమాల పరిస్థితి ఏంటి అని ఆందోళన పడుతున్నారు నయనతార అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: