జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నాడు నాగచైతన్య. ఇక ఈ సినిమాతో థియేటర్లో అంతగా నప్పించలేకపోయినప్పటికీ తన నటనతో అందరినీ తన సొంత చేసుకున్నాడు నాగచైతన్య. ఇక ఆ సినిమా తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య. హీరోగా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. దాని తర్వాత ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటించాడు నాగచైతన్య. 

తాజాగా ఇప్పుడు కష్టడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలివితోపాటు తమిళంలో సైతం మే 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది పాజిటివ్ సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య కి జోడిగా కృతి శెట్టి హీరోయిన్గా నటించిన.. బంగార్రాజు సినిమా తర్వాత మరోసారి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ గా కృతి శెట్టి ని అనుకోలేదట. వేరే స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట.

 కానీ ఒక చిన్న కారణంగా ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసింది.దింతో చివరకు కృతి శెట్టిని ఈ సినిమాలో తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  తాజాగా అందుకున్న సమాచారం మేరకు మొదటగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందనాన్ని తీసుకోవాలని అనుకున్నారట. సినిమా కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేసింది అట రష్మిక మందన .పుష్ప సినిమాతో పారన్ ఇండియా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళ హిందీ భాషల్లో సైతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండడంతో పాటు తనకు డేట్స్ కూడా అడ్జస్ట్ కాకపోవడంతో రష్మిక మందన ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: