చదువుతో సంబంధం లేకుండా వ్యాపారాలు చేస్తూ లక్షల సంపాదిస్తున్న వారి సంఖ్య ఈమధ్య కాలంలో రోజురోజుకు పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా బిజినెస్ వైపు అడుగులు వేస్తూ దూసుకుపోతున్నారు. మరికొంతమంది వ్యవసాయం చేసుకుంటూ తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో సాంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తులకు కూడా విపరీతంగా డిమాండ్ పెరిగింది .ఈ నేపథ్యంలోనే వ్యవసాయం చేస్తూ కూడా లక్షల సంపాదిస్తున్న రైతులు మనకు తారసపడుతున్నారు.

అలాంటి వ్యాపారంలో చేపల పెంపకం కూడా ఒకటి.  ఈ పెంపకంలో ఏడాదికి రూ. 25 వేల పెట్టుబడి మీరు పెట్టినట్లయితే నెలకు లక్షల సంపాదించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది.  ఇక చేపల పెంపకానికి సంబంధించిన రుణాలను కూడా బ్యాంకులు అందజేస్తున్నాయి.  కేంద్రంలోని మోదీ సర్కార్ ముద్రా రుణం ద్వారా మీరు వ్యాపారాలు ప్రారంభించే ముందు లోన్ తీసుకోవచ్చు.  మంగుర్ చేపల పెంపకం ఇప్పుడు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తోంది.

ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో జపాన్,  చైనా తర్వాత భారత్ ఇప్పుడు మూడవ స్థానంలో ఉంది.  రైతులకు ఇది చాలా లాభదాయకమైన వ్యాపారంగా అభివృద్ధి చెందింది.  ముఖ్యంగా చేపల కోసం చెరువు నిర్మాణానికి ఒక ఎకరం ఉంటే సరిపోతుంది.  నేల విలువ 8 పీహెచ్ ఉండేలా ఎంచుకోవాలి అలాగే చెరువులో మంచినీటిని మాత్రమే ఏర్పాటు చేస్తే సరిపోతుంది. మంగుర్ జాతి చేప ఆరు నెలల్లో 120 గ్రాముల బరువు పెరుగుతుంది ఒక హెక్టార్ చెరువులో నాలుగు టన్నుల చేపలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ పెంపకానికి హెక్టార్కు రెండు లక్షల రూపాయల వరకు మీకు ఖర్చు అవుతుంది అదే సమయంలో ఐదు లక్షల వరకు సులభంగా సంపాదించవచ్చు. స్వర్ణకారు రైతులు కూడా చిన్న చెరువులో ఈ చేపల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: