ఈ మద్య తెలుగు సినీ తారలు రక రకాల అవతారాలు ఎత్తుతూ జనాలను ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్నామద్య అందాల తార రకూల్ ప్రితిసింగ్ కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్ముతూ దర్శనమిచ్చింది. నిన్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఆటో నడుపుతూ కనిపించాడు. తాజాగా బాహుబలి భల్లాల దేవ రానా మార్కెట్ లో మూఠామేస్త్రీ అవతారం ఎత్తాడు. కూలీ వేశం వేసి ఖాకీ బట్టలు వేసుకొని రైతుబజార్లో మూటలు మోసి డబ్బు తీసుకున్నాడు.

అయితే ఇదంతా ఏదో షూటింగ్ లో భాగం అనుకుంటే పొరపాటే..నిజంగా జనాల మధ్యకు వచ్చి లైవ్ గా చేస్తున్న పనులు వీటిని చూస్తున్న జనాలకు మాత్రం తమ అభిమాన తారలు ఏకంగా తమదగ్గరకు వచ్చి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఇంతకీ వీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారా అని అనుకుంటున్నారు. ఈ మద్య మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి  ' నేను సైతం ' అనే షో కోసమే ప్రారంభించబోతుంది..దీనికోసం సెలబ్రెటీలు ఆ షో ప్రోషన్ కోసం చేస్తున్న ఫీట్స్ అని తెలిసింది.

కూరగాయలు అమ్ముతున్న రకూల్ ప్రితిసింగ్, ఆటో నడుపుతున్న అఖిల్


ఒక బాలీవుడ్ షో స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ కొత్త కాన్సెప్ట్ జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది.ఈ కాన్సెప్ట్ లో భాగంగా, తెలుగు సినీ తారలంతా కష్టపడి లేబర్ వర్క్ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీ కోసం ఉపయోగిస్తారు.ఇలా సినీ తారలు కష్ట పడ్డ సొమ్ముతో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం డొనేట్ చేస్తారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: