అలనాటి అగ్రతార విజయశాంతి... తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ గొప్ప నటి. హీరోలకే హీరోఇజం నేర్పించిన గొప్ప  నటి. సినిమాకు స్టార్ హీరోలు అవసరం లేదు హీరోయిన్ తోనే ప్రేక్షకులను  మెప్పించి భారీ విజయాన్ని పొందవచ్చు  అని తెలుగు పరిశ్రమలో నిరూపించింది  టాలీవుడ్ అమితాబ్ విజయశాంతి. అలనాటి దర్శకులకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నటి విజయశాంతి. హీరోలను తలదన్నే స్టార్ డమ్  సంపాదించి ... సగటు తెలుగు ప్రేక్షకుడి మనసుకు  ఎంతో దగ్గరైంది విజయశాంతి. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీ లికుంచుకుంది . అయితే ఆ తర్వాత సడన్గా అభిమానులు అందరికి షాక్ ఇస్తూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్ళింది విజయశాంతి. అక్కడ తనదైన మార్కును కొనసాగించింది . అయితే దాదాపు 13 ఏళ్ల తర్వాత... తమ అభిమాన నటి విజయశాంతి సినిమాల్లో నటిస్తే బాగుంటుందని అభిమానుల కోరిక నెరవేరుస్తూ  సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించబోతోంది లేడీ అమితాబ్ విజయశాంతి. 

 


 అయితే రాజకీయాల్లోకి వెళ్లి  పదమూడేళ్లు అయినప్పటికీ... తెలుగు ప్రేక్షకుల్లో  విజయశాంతి పై ఉన్న  అభిమానం మాత్రం ఇప్పటివరకు కొంచెం కూడా తగ్గలేదు. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి నటనను  వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ  వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు తెలుగు అభిమానులు. అయితే 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ విజయశాంతి చరిష్మా  మాత్రం ఎక్కడా తగ్గలేదు. 13 ఏళ్ల తర్వాత కూడా ఆమె ముఖంలో అదే పట్టుదల అదే రాజసం ఉట్టిపడుతుంది. అయితే మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో రాబోతున్న సరిలేరు నీకెవ్వరు లో  నటిస్తున్న విజయశాంతి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది . 

 

 అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగి పోవడానికి 13 ఏళ్ల తర్వాత విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుండడం కూడా ఒక కారణమనే  చెప్పాలి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై  యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో అనిల్ రావిపూడి  మార్క్ కామెడీ వెర్షన్  ఫుల్ గా కనిపిస్తోంది. ఇక తాజాగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు టీజర్ లో విజయశాంతి ని చూస్తుంటే ఆమె చరిష్మా కొంచెం కూడా తగ్గలేదు . గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్ అంటూ 13 ఏళ్ల తర్వాత ఓ సినిమాలో విజయశాంతి చెప్పిన డైలాగ్ తో ప్రేక్షకులను ఆనంద పడుతున్నారు. ఇప్పటికే వరుస హిట్లతో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్  హిట్ అవుతుందని అందరూ అనుకుంటుండగా.. ఈ సినిమాకు లేడీ అమితాబ్ విజయశాంతి చరిష్మా  కూడా తోడై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్  హిట్ అవుతుందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: