టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో స్వీటీ అనుష్క ఒకరు. సూపర్ సినిమా నుండి భాగమతి వరకు అనుష్క తన స్పెషాలిటీ చాటుతూ వస్తుంది. కమర్షియల్ సినిమాల్లో తన అందాలతో ఆడియెన్స్ ను మెప్పించడమే కాకుండా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు తాను స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఏ స్టార్ హీరోయిన్ చేయని ప్రాజెక్టులు చేసి సర్ ప్రైజ్ చేసింది స్వీటీ. భాగమతి తర్వాత అనుష్క నిశ్శబ్ధం మూవీ చేసింది. ఆ సినిమా రిలీజ్ సంక్షోభంలో ఉంది. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో వచ్చిన నిశ్శబ్ధం సినిమాలో అనుష్క డెఫ్ అండ్ డం పాత్రలో నటించింది.

 

ఇక ఇదిలాఉంటే కొద్దిరోజుల క్రితం అనుష్క కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ గౌతం మీనన్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమా గురించి ఒక సర్ ప్రైజ్ న్యూస్ కోలీవుడ్ మీడియా సర్కిల్ లో చెక్కర్లు కొడుతుంది. ఇటీవల గౌతం మీనన్ ఇంటర్వ్యూ లో ఏమాయ చేసావే సినిమా సీక్వల్ స్క్రిప్ట్ సిద్ధమైందని అన్నారు. ఆ సినిమా సీక్వల్ కు శింబు ఓకే చెప్పగా త్రిష బదులుగా అందులో హీరోయిన్ గా అనుష్కని తీసుకోవాలని చూస్తున్నారట. ఏమాయ చేసావే కోలీవుడ్ వర్షన్ విన్నైతండి వరువాయి మూవీకి సీక్వల్ కథ రెడీ అయ్యిందట.  

  

శింబు, త్రిష నటించిన ఆ సినిమా సీక్వల్ లో అనుష్కని తీసుకోవాలని చూస్తున్నారట. అనుష్కకు ఉన్న సూపర్ ఫ్యాన్ ఫాలోవర్స్ కు ఆ సినిమా చేస్తే చాలా బాగుంటుంది. ఆ సినిమా సీక్వల్ అంటే ముద్దుల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. మరి అనుష్కని అన్నేసి ముద్దులు పెడితే ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. గౌతం మీనన్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే రిలీజ్ కోసం అనుష్క ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: