టాలీవుడ్ కి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడుగా పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా 'కొత్త బంగారు లోకం'. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించగా శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. దాంతో శ్వేతా బసు కి వరసగా రైడ్, కళావర్ కింగ్, కాస్కో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలన్ని అంతగా సక్సస్ సాధించకపోవడంతో శ్వేతా బసు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతా అనుకున్నది కాస్త సినిమాలు లేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందీ. దాంతో ఇండస్ట్రీలో కొంతమంది శ్వేతా బసు ని పక్కదారి పట్టించి జీవితం నాశనం అయ్యోలా చేసారు. ఈ దెబ్బకి పూర్తిగా శ్వేతా బసు ని చిత్ర పరిశ్రమ దూరం పెట్టింది.

 

అయితే కొంతకాలాని పరిస్థితులు చక్కబడిన తర్వాత శ్వేతా బసు ప్రసాద్ పెళ్ళి చేసుకుంది. అది ఎక్కువకాలం సాఫీగా సాగకపోవడంతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు చుట్టు ముట్టడం తో అవన్ని విడిపించుకొని మళ్ళీ సినిమా ప్రయత్నాలలో పడిందట. ఈ నేపథ్యంలోనే వర్కౌట్స్ చేసి మళ్ళీ నాజూగ్గా తయారైంది. ప్రస్తుతం తన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా ప్రేక్షకులకి టచ్ లో ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నాలలో ఉంది. 

 

అంతేకాదు తన లేటెస్ట్ ఫోటోస్ తో టాలీవుడ్ మేకర్స్ కి మానేజర్స్ కి పంపించి ఏదైనా చిన్న అవకాశం ఇప్పించమని అడుగుతుందట. పనిలో పనిగా వెబ్ సిరీస్ లలోను అవకాశాలు వస్తే చేస్తానంటు చెబుతుందట. రాధికా ఆప్టే, కియారా అద్వానీల మాదిరిగా బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లలో హాట్ అండ్ గ్లామర్ రోల్స్ చేయడానికి అడల్ట్ కంటెంట్ ఉన్న వాటిలో నటించడానికి సిద్దమని చెబుతుందట. మరి ఎవరైనా శ్వేతా బసు గోడు విని అవకాశం ఇస్తారేమో చూడాలి. అయితే ఇప్పటికే కొన్ని ముంబై సీరియల్స్ కి కూడా చేస్తానని చెప్పడంతో అక్కడి వాళ్ళు కాస్త స్లిమ్ గా అవమని సలహా ఇచ్చారట. అందుకే ఇప్పుడు ఫస్ట్ సినిమాకి ఎలా ఉండిందో అలా తయారైంది.


   

మరింత సమాచారం తెలుసుకోండి: