టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మొత్తానికి సూపర్ హిట్ కొట్టి, రెండేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్న పరిస్థితి నుండి బయటపడ్డాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ ఇద్దరూ కలిసి నిర్మించగా ఎస్ ఎస్ థమన్ అత్యద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఆకట్టుకునే కథ, కథనాలతో కుటుంబంలోని ఎమోషన్స్ ప్రధానంగా సాగిన ఆ సినిమాని త్రివిక్రమ్ తన మార్క్ పంచ్ డైలాగ్స్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి చిత్రీకరించడం జరిగింది. 

 

ఇక ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఎంతో పెద్ద సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు బన్నీ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పలు మాస్ అంశాల మేళవింపుగా దర్శకడు సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు టాక్. 

 

ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు మొత్తానికి తెరపడే రోజు రానే వచ్చింది. మరొక రెండు రోజుల్లో బన్నీ పుట్టిన రోజు కావడంతో ఆరోజున ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవబోతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి కాసేపటి క్రితం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, నేటి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు అల్లు అర్జున్ 20మూవీ అప్డేట్ రాబోతోంది అంటూ ట్వీట్ చేసారు. దీనితో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి వారు ఆ సమయంలో ఎటువంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: