సెలబ్రిటీల ప్రేమాయణాలు అంటే మీడియాకు ఫుల్ మీల్స్ పెట్టినట్లుగా ఉంటుంది. సెలబ్రిటీల ప్రేమ  గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది హాట్ టాపిక్ గా  మారిపోతుంది. మామూలుగా సినిమాల గురించి వచ్చే వార్తల కంటే సెలబ్రిటీల ప్రేమాయణాలు గురించి వచ్చే గోస్సిప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి . సెలబ్రిటీలు ప్రేమాయణం నడుపుతున్న... ఎక్కడైనా కలిసి కనిపించిన... వారిద్దరూ విడిపోయినా ... ఇలా సెలబ్రిటీల గురుంచి ఏదైనా హాట్ టాపికే.  అందుకే చిన్న విషయం జరిగినా అది సంచలనంగా మారిపోతుంది. అయితే తాజాగా బాలీవుడ్ నటి తన ప్రేమాయమం  గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

 

 

 మోడల్, మాజీ మిస్ ఇండియా బాలీవుడ్ నటి మహిమా చౌదరి ప్రస్తుతం సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మనసులో మాట అనే చిత్రంలో నటించిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత కాస్త సినిమాలకు దూరమై పోయింది మహిమ.  అయితే ఈ అమ్మడు చేసిన సినిమాల కంటే ఈ అమ్మడు ప్రేమాయణం  కారణంగానే ఎక్కువ క్రేజ్ సంపాదించింది. ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తో సుదీర్ఘకాలంపాటు ప్రేమలో మునిగి తేలింది ఈ ముద్దుగుమ్మ. కానీ వీరిద్దరికీ బ్రేకప్  మాత్రం అప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వీరిద్దరికీ బ్రేకప్ అయిన తర్వాత లియాండర్ పై మహిమ ఎన్నో విమర్శలు కూడా చేసిన విషయం తెలిసిందే. వేరే యువతి తో కులుకుతూ లియాండర్ తనను మోసం చేసాడు అంటూ బహిరంగంగానే విమర్శలు చేసింది. తనను మోసం చేశాడు అనడానికి పలు కారణాలు చెబుతూ ఎన్నోసార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 

 

 ప్రేమాయణం విషయం ఎలా ఉన్నప్పటికీ బ్రేకప్ తర్వాత జరిగిన రచ్చ  తన సినీ కెరీర్ పైన పడింది. దీంతో అగ్రకథానాయికగా ఉన్నా మహిమా చౌదరి కాస్త జీరో గా మారిపోయింది. 2006లో ఆర్కిటెక్ట్ కం బిజినెస్ మాన్ అయినా బాబీ ముఖేర్జీ  ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఓ కుమార్తె కూడా ఉంది. ఇక వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా 2011లో ఈ జంట విడిపోయింది. అనంతర కాలంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహిమా చౌదరి... లియాండర్ మంచి టెన్నిస్ ప్లేయర్ కావచ్చు కానీ తనతో  మాత్రం నిజాయితీగా గేమ్ ఆడలేదు అంటూ వ్యాఖ్యానించారు. అతను వేరొకరితో షికార్లు చేస్తూ తనను ప్రేమిస్తోన్నట్లు  నటించాడు అంటూ ఆరోపించింది. అయితే వీరిద్దరి బ్రేకప్  చాలా వరస్ట్ బ్రేక్ అప్ లలో ఒకటిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: