సినిమాలలో పోలిస్తే ఈ మధ్య వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది..ఎవరు చూసినా కూడా వెబ్ సిరీస్ లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అందుకే వీటికి ఈ మధ్య కాలంలో డిమాండ్ బాగా పెరిగింది.. ఇకపోతే చిన్న స్టార్ల నుంచి సమంత, జగపతి బాబు లాంటి పెద్ద హీరోలు కూడా వెబ్ సిరీస్ చేస్తున్నారు.. ఇకపోతే వెబ్ సిరీస్ లోని  ఖర్చు కన్న డబ్బులు ఫేమస్ రెండు అవ్వడంతో అందరూ వెబ్ సిరీస్ లలో మక్కువ చూపిస్తున్నారు..

 

 

 

ఈషా రెబ్బాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. వస్తున్న సినిమాలు చేస్తూనే మెల్లగా వెబ్ సిరీస్ ల వైపు షిఫ్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా హిందీలో హిట్టయిన లస్ట్ స్టోరీస్ ను తెలుగులో రీమేక్ చేస్తోంది. హిందీలో కియరా అద్వానీకి సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన పాత్రను తెలుగులో ఈషా రెబ్బా పోషిస్తోంది. ఈ హాట్ సిరీస్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ తెలుగమ్మాయి.

 



లస్ట్ స్టోరీస్ 4 భాగాలుగా తెలుగులో వస్తోందట. 3 భాగాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. అయితే నాలుగో భాగానికి సంబంధించిన షూట్ మాత్రం పెండింగ్ లో పడిందని చెబుతోంది.అయితే ప్రస్తుతం కరోనా దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ పనులను వాయిదా పడడంతో ఇప్పుడు అన్నీ రంగలుమూతపడ్డయి ..


 

 

ఈషా రెబ్బా నటించిన సిరీస్ ను సంకల్ప్ రెడ్డి డైరక్ట్ చేశాడు. ఈ సిరీస్ పై చాలా హోప్స్ పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. వెబ్ సిరీస్ తో క్లిక్ అయితే ఇక అటువైపు ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది ఈమె ప్లాన్. తెలుగులో అడపాదడపా వినిమలలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో అవకాశాలు రావడమే కష్టంగా మారాయి .. దీంతో. ఇషా ఇంకా అటు సైడుగా బిజీ కానుందని తెలుస్తోంది.. చూద్దాం ఏ  మాత్రం సక్సెస్ అవుతారో అన్న విషయం...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: