సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో వచ్చిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి. అప్పట్లో 70 ఏళ్ల సినీ చరిత్రలో కనివిని ఎరుగని అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు అప్పటివరకు ఉన్న సినిమాల రికార్డులన్నింటినీ తుడిచిపెట్టిన సినిమా పోకిరి. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ల తొలి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. 

 

ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ సోదరి మంజుల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో ఆకట్టుకునే కథ కథనాలు, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవర్ఫుల్ ఫైట్స్, మెస్మరైజింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మహేష్ బాబు క్యారెక్టర్ యొక్క నడవడిక మరియు ఆయన పలికే డైలాగ్స్ అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అప్పట్లో మాత్రమే కాదు, ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆ సినిమా పెద్ద సెన్సేషన్ గా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని డైలాగ్స్ థియేటర్లో అదరగొట్టగా, ఒకానొక సందర్భంలో 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు' అంటూ మహేష్ బాబు పలికిన డైలాగ్ టోటల్ సినిమాలో పెద్ద హైలైట్ అవడంతో పాటు, ఆయన ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. 

 

అలానే 'నేను ఎంత ఎదవనో నాకే తెలియదు' 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' 'కొంచెం షట్టర్ తెరిచిపెట్టుకోమ్మా,  పారిపోవటానికి ఉంటది' అంటూ మహేష్ పలికే మరి కొన్ని డైలాగులు కూడా అదరగొట్టాయి. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ, తన కెరీర్ మొత్తంలో పోకిరి అనేది ఒక ప్రత్యేకమైన సినిమా అని, అలానే ఆ సినిమాలోని డైలాగ్స్, యాక్షన్, ఫైట్స్, సాంగ్స్ వంటివి తానే మళ్లీ చేయలేనని సరదాగా చెప్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు ఇలియానాల జంట తెర పై అదరగొట్టడం, అలానే పక్కా మాస్ క్యారెక్టర్ లో ఫస్ట్ టైం నటించి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అందర్నీ కూడా తన ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు మహేష్ బాబు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: