స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సూపర్ హిట్ అందుకున్నాయి. ఇక రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. శేషాచలం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మళయాళ భామ నివేదా థామస్ నటిస్తుందని అన్నారు. అయితే ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని అన్నారు. కానీ సినిమా నుండి ఆమె ఎగ్జిట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

నివేద థామస్ కూడా పుష్ప లో లేదన్న క్లారిటీ ఇచ్చేశారు చిత్రయూనిట్. అయితే యాంకర్ అనసూయ కూడా పుష్ప నుండి బయటకు వచ్చిందని అంటున్నారు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ తన నటనతో మెప్పించింది. అదే సెంటిమెంట్ తో పుష్ప సినిమాలో కూడా ఆమెను తీసుకున్నారు. అయితే పుష్పలో పాత్ర నచ్చలేదో లేక తాను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వనని చెప్పారో కానీ అనసూయ పుష్ప సినిమా నుండి బయటకు వచ్చిందని లేటెస్ట్ టాక్. 

 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. సినిమాతో బన్ని నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. సుకుమార్ రంగస్థలం కేవలం తెలుగులోనే రిలీజ్ అయినా మిగతా భాషల్లో తర్వాత రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు బన్ని పుష్ప ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా అక్కడ స్టార్స్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌతులా స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుందని చెప్పగా.. విలన్ కూడా బాలీవుడ్ నుండి వస్తున్నాడని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: