భారత చిత్ర పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు లెజెండరి నటులు   చిత్ర పరిశ్రమకు దూరమై తీవ్ర దిగ్భ్రాంతిని నింపారు. లెజెండరీ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తులు ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దూరమయ్యాను. ఒకరోజు వ్యవధిలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరి మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నింపింది . నిన్న బాలీవుడ్  నటుడు ఇర్ఫాన్ ఖాన్  పెద్దపేగు వ్యాధితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ ఖాన్  తన నటనతోనే కాకుండా తన మంచి మనసుతో కూడా బాలీవుడ్లో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 

 

 

 అలాంటి గొప్ప వ్యక్తి ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ను వదిలి వెళ్ళిపోయారు అని బాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ఇర్ఫాన్ ఖాన్ మరణం ఘటన మరవకముందే మరో గొప్ప వ్యక్తి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇక లేరు అని తెలిసి చిత్రపరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయారు. విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న రిషి కపూర్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో  ఇకలేరు అనే విషయాన్ని... పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. 

 

 

 రిషి కపూర్ మృతి పై ఎంతో మంది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్  రిషీకపూర్ లకు సంబంధించిన ఫోటో అభిమానులు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారు. భారత చిత్ర పరిశ్రమ రెండు రోజుల్లోనే ఇద్దరు లెజెండరీ నటులను కోల్పోయింది  అని అంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈ ఇద్దరు లెజెండరీ నటుల మరణంతో  తీవ్ర దిగ్భ్రాంతి లో మునిగిపోయారు అనే చెప్పాలి. అయితే ఈ లెజెండ్రీ నటుడు ఇద్దరూ కలిసి ఒకచోట దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో పై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్న అభిమానులు మీరు మా  హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు అంటూ సంతాపం తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: