మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ సినిమా చేస్తాడని తెలిసిందే. ఈ సినిమాను ముందు సుజిత్ డైరెక్ట్ చేస్తాడని అనుకోగా అతని ఆ ఛాన్స్ మిస్సయ్యాడు. సుజిత్ కాదన్న ఆ అవకాశాన్ని వి.వి.వినాయక్ అందుకున్నాడు. ఆల్రెడీ చిరుతో రీమేక్ సినిమాలతో రెండు సూపర్ హిట్లు కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అందులో ఒకటి ఠాగూర్ కాగా.. రెండవది ఖైది నంబర్ 150.

ఇక ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. మళయాళ లూసిఫర్ లో పాటలు లేవు. కాని అన్నయ్య సినిమాను పాటలు లేకుండా ఊహించగలరా.. అందుకే లూసిఫర్ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా చిరు ఇమేజ్ కు సరిపోయేలా చేస్తున్నారట. తప్పకుండా ఈ సినిమా మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా ప్లాన్ చేస్తున్నారట. మెగా ఫ్యాన్స్ కోరుకునే డ్యాన్సులు, ఫైట్లు అన్ని ఈ సినిమాలో ఉంటాయని టాక్.

మొత్తానికి లూసిఫర్ రీమేక్ చిరు రేంజ్ కు ఏమాత్రం తగ్గదని అంటున్నారు. తప్పకుండా ఈ సినిమాతో చిరు మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఒకేసారి 3 సినిమాలు లైన్ లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. చిరు సినిమా గురించి బూస్ బంప్స్ న్యూస్ చెప్పిన వినాయక్ తప్పకుండా లూసిఫర్ రీమేక్ తో సత్తా చాటుతాడని అంటున్నారు. వినాయక్ తర్వాత బాబి, మెహెర్ రమేష్ లతో కూడా సినిమాలు ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది.                                                              

 

మరింత సమాచారం తెలుసుకోండి: