ప్రస్తుతం ఆమె పలు టివి చానల్స్ షోలకు వ్యాఖ్యాత గా అలానే జడ్జి గా కూడా వ్యవహహరిస్తున్నారు. అయితే ఈటీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ఆమెకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం అటు వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటిస్తూ కొనసాగుతున్న అనసూయ, అడివి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించి మంచి పెరు సంపాదించారు. ఆ తరువాత రాం చరణ్ హీరోగా సుకుమార్ తీసిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో తనదైన ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ మనసు గెలుచుకున్న అనసూయ, ఆ తరువాత నుండి మరింతగా అవకాశాలతో దూసుకెళ్తున్నారు.
ఇక లేటెస్ట్ గా కొద్దిరోజుల నుండి ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూస్తుంటే ప్రస్తుతం అనసూయ ఏకంగా పవర్ స్టార్ మూవీ లొనే ఒక మంచి పాత్ర పట్టేసారని అంటున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ లో పవర్ స్టార్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తుండగా ఈ మూవీలోని ఒక కీలక పాత్ర లో అనసూయ కనిపించనున్నారట. కాగా ఆమెది సినిమాని ఒక కీలక మలుపు తిప్పే పాత్ర అని, అయితే అటువంటి పాత్రని ఆమె అయితేనే సమర్ధవంతంగా పోషించగలదని భావించిన మూవీ యూనిట్ ఇటీవల ఆమెని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. కాగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలో రానుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం అనసూయ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే అంటున్నారు ప్రేక్షకులు...... !!