మన సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించిన కథలు, కథనాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి, భయానికి గురి చేస్తే, మరికొన్ని కథలు హాస్యానికి గురి చేసి, వారి పొట్ట చెక్కలయ్యేలాగా చేస్తూ ఉంటాయి. అంతలా కథలను అద్భుతంగా తెరకెక్కిస్తారు మన దర్శక నిర్మాతలు. ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ అలాగే ఆయన సుపుత్రుడు అల్లరి నరేష్ ఇద్దరూ కలిస్తే సినీ ఇండస్ట్రీలో ఒక ప్రభంజనం అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి ఎంతో చక్కగా హాస్యాన్ని పండించి , ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాల్లో దాదాపుగా హాస్యాన్ని పండించిన చిత్రాల్లో, ఆ సినిమా మాత్రం అంతకు మించి అనే లాగా ఉంది. అయితే ఆ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అల్లరి నరేష్ హీరోగా గీతాసింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం కితకితలు. ఈ చిత్రానికి ఈ వీ వీ సత్యనారాయణ దర్శకత్వం వహించిగా, ఇక ఈయనే నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఇందులో ధర్మవరపు సుబ్రమణ్యం, గిరిబాబు, తనికెళ్ల భరణి, కృష్ణభగవాన్, జయ ప్రకాష్ రెడ్డి , సునీల్ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించి , అందరి మన్ననలు పొందారు. ఇక ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. ముఖ్యంగా గీతాసింగ్, అల్లరి నరేష్ ల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నుల పండుగగా అనిపించాయి.అంతేకాకుండా సమయానికి తగ్గట్టుగా డైలాగులను డెలివరీ చేస్తూ, ఎం ఎస్ సత్యనారాయణ, సునీల్, కృష్ణ భగవాన్ తదితరులు చాలా చక్కగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే , అల్లరినరేష్ కొత్తగా ఎస్సై ఉద్యోగంలో చేరతారు .ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా పెళ్లి చేసుకోమని , లేకపోతే ఉరేసుకుంటామని బెదిరిస్తే, ఇక తప్పని పరిస్థితులలో వేరొక అమ్మాయిని చూడడానికి వెళ్లి కోటేశ్వరరాలు అలాగే స్థూలకాయురాలైనా గీతాసింగ్ ను పెళ్లి చేసుకుంటాడు.ఇష్టం లేని ఆమెను పెళ్లి చేసుకొని , కష్టంగా హనీమూన్ కి వెళ్ళి, అలా అక్కడ మరి కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు హాస్యాన్ని తెప్పిస్తాయి. ఇలా ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఎంతో కామెడీగా సాగింది అని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: